పొమ్మన్నప్పుడల్లా ఎక్కడికి పోనూ
అంటూ చిలిపిగా ప్రశ్నించే నీకు ఏ మాట వినాలనుందో నాకు తెలుసు..
ఒక్కసారి ఎదలోకి అడుగేసాక
ఎన్ని తకధిములైనా నీ హృదయవేదిక మీదనేనని నీకూ తెలుసు..
శూన్యాన్ని సైతం వెలిగించే తలపులుండగా
పరితాపమైనా పరిమళించాలే కానీ వెలితిని శ్వాసించరాదు కదా..
ఇచ్చిన ప్రాణమంటి కానుక పదిలంగా దాచుకున్నప్పుడే
నీ మది మహారాజ మందిరమని గుర్తించు..
No comments:
Post a Comment